Friday, February 9, 2018

ఇదే నా అంతిమ నమస్కారం


ఇదే నా అంతిమ నమస్కారం




సాహితీమిత్రులారా!


అశ్వధాటీ వృత్తాలలో దేవిని స్తుతించినవారు
కాళిదాసని తెలుసు దానికే దేవీఅశ్వధాటి స్తోత్రం
అని కూడ అంటారు. అలాగే పండిత జగన్నాథుడు
కూడ అశ్వధాటి కావ్యాన్ని కూర్చారు. అందులో
జగన్నాథుడు తంజావూరు నుండి ఉత్తర భారతదేశం
వెళ్ళినట్లు తెలిసే శ్లోకం ఒకటుంది. తన విద్యాభ్యాసం
పూర్తవగానే దక్షిణాపథంలోని తంజావూరు రాజాస్థానంలో
ప్రవేశించాడు. అక్కడ వారి సత్కారాలు నచ్చక అక్కడ
నుండి ఉత్తరాపథం వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఈ శ్లోకం చూడండి-

ఖంజాయితోధిమతి గంజావరోపి బత సంజాయ తేత్ర ధన దః
సంజాఘటీతి గుణపుంజాయితస్య నతు గుంజామితంచ కనకం
కింజాగ్రతీ జయసి కిం జానతీ స్వపిషి శింజాననూపురపదే 
తేజోపురేశి నవకంజాక్షి సాధు తదిదంజాతు వాకిము శివే


ఇక్కడున్న ధనవంతుడు గర్వాంధుడు. మధుపాయి.
ఇక్కడున్న గుణవంతునికి గురిగింజయెత్తు సరిగల
బంగారం కూడ లేదు. ధ్వనించే అందెలచే అంకితమైన
తల్లీ కమలదళాలంత విశాలమైన కళ్లున్నదానా
మేలుకొని ఉన్నావా నిద్రపోతున్నావా కామేశ్వరీ మేలు
మేలు నీకిదే నాకడసారి(అంతిమ)నమస్కారం.
స్వీకరించి ప్రయాణానికి అనుమతించు - అని భావం


No comments:

Post a Comment