Saturday, February 17, 2018

సీతాయన - వైద్యనాథ్ మాలిక్


సీతాయన - వైద్యనాథ్ మాలిక్




సాహితీమిత్రులారా!


రామాయణం విన్నాం గాని సీతాయన ఏమిటి అంటే
దాని రచయిత వివరాలు చూద్దాం-

వైద్యనాథ్ మాలిక్, విధు ప్రముఖమైథిలి పండితుడు.
ఈయన బీహార్ లోని మధుబని జిల్లా విరౌల్ గ్రామంలో
1912వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని రచనలు
1934లో వచ్చిన భూకంపంలో పోయాయి. 
పద్యాలు పత్రికల్లో వచ్చాయి. హిందీ, మైథిలి భాషల్లో 
చాల పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 
చాలా వృత్తులు చేపట్టినా చివరకు పూర్వపు దర్భంగా 
రాజ్యంలోని రాజ్ నగర్ లో మేనేజరుగా పదవీవిరమణ చేశారు.

1976లో సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సీతాయన
ఈయన ముద్రిత రచనలలో మొదటిది. ఇది 7 సర్గల
ఇతిహాస కావ్యం. ఇది రచించటానికి ఈయనకు 
11 సంవత్సరాల సమయం పట్టింది. ప్రతిసర్గలోను
మళ్ళీ 7 ఉపసర్గలున్నాయి. కవి దీన్ని సప్తసర్గి సుమన్ అన్నాడు.
ఉదాత్త పాత్రలు, ధారాశుద్ధిగల శైలి, ఇతివృత్త నిర్వహణ
నైపుణ్యం గల సీతాయన మైథిలి సాహిత్యంలో విశిష్టరచన.

మొదటి సర్గలో - 
మిథిలా వర్ణన, సాంఘిక ఆచారాలు, పద్ధతులు,
సీతను ఆది శక్తిగా చెప్పటం, ఆమె భూప్రవేశం,
జనకుడు శ్రయజ్ఞ నిర్వహణకు నిశ్చయించుకోవటం,
సీతావతార జననం, మొదలైనవి ఉన్నాయి.

రెండవ సర్గలో -
సీతా బాలికాలీలలు

మూడవ సర్గలో-
సీతావివాహం

నాలుగవ సర్గలో -
సీత వనవాసాగమనం

ఐదవ సర్గలో -
సీతాపహరణం

ఆరో సర్గలో -
అగ్ని పరీక్ష

ఏడవ సర్గలో-
ధరణిప్రవేశం

ఈ విధంగా కూర్చారు వైద్యనాథ్ మాలిక్ గారు

రామాయణం వంటిదే సీతాయణ
సీతను మహామాయగా, ఆదిశక్తిగా 
కవి చిత్రించాడు. సంస్కృత సాహిత్య 
విమర్శకులు ఇతిహాసానికి నిర్ణయించిన
అన్ని లక్షణాలు దీనికున్నాయి.
పటిష్టమైన పదబంధాలు, స్పష్టమైన అభివ్యక్తి, 
విస్తార వర్ణన, ధారాశుద్ధి గల శైలితో ఈ కావ్యం
సహృదయ రంజకంగా ఉంటుంది.

( ఆధారం- విజ్ఞాన సర్వస్వం - 6, భారతభారతి పుట. 947)


No comments:

Post a Comment