Tuesday, November 14, 2017

ధృతరాష్ట్రునికి భార్యలెందరు?


ధృతరాష్ట్రునికి భార్యలెందరు?




సాహితీమిత్రులారా!


మనకు తెలిసిన వరకు ధృతరాష్ట్రునకు
గాంధారి ఒకతే భార్య. కానీ
ఆంధ్రమహాభారతంలోని(1-5-12,13)
ఈ విషయాలు గమనిస్తే ఎంతమందో
తెలుస్తుంది.
సుబంధుడు అనే గాంధారరాజుకు
11మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు
గాంధారి, సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ,
సంహిత, తేజశ్శ్రవ, సుశ్రవ, నికృతి,
శుభ, సంభవ, దశార్ణ -అనే 11 మంది స్త్రీలు.
శకుని అనే పురుషుడు.
ఈ పదకొండు అమ్మాయిలను ఏకముహూర్తంలో
ధృతరాష్ట్రునికి భీష్ముడు వివాహం చేయించాడు.

కులమును రూపము శీలముఁ
గలకన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుండీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల
తిలకుండు వివాహమయ్యె దేవీశతమున్
                                                           (ఆంధ్రమహాభారతం - 1-5-13)

ఒక మారుకాకుండా తెచ్చి తెచ్చి నూరుమంది
రాజకుమార్తెలను భీష్ముడు చేశాడని పైపద్యవలన
తెలుస్తున్నది. కావున
ఈ లెక్కప్రకారం అక్షరాల 111 మంది
భార్యలు ధృతరాష్ట్రునికి అని తేలుతున్నది.

No comments:

Post a Comment